20న హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ

20న హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ

0
TMedia (Telugu News) :

20న హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ

టీ మీడియా, మార్చ్ 7, హుస్నాబాద్ : ఈ నెల 20న హుస్నాబాద్‌ లో లక్ష మందితో మంత్రి కేటీఆర్ సభ ఉంటుందని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. గౌరవెల్లి ప్రాజెక్టులో బాధితులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని రూ. 20కోట్లతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు మంజూరు చేశామని వెల్లడించారు. 8 టీఎంసీల గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని గౌరవెల్లి ప్రాజెక్టును ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి పార్టీలు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహించారు. గౌరవెల్లి నిర్మాణం కోసం ఇసుక తీస్తుస్తే బీజేపీ నాయకుడు రాంగోపాల్ రెడ్డి హైకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని.. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి నీళ్ళు ఇవ్వడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు.

Also Read : శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్

పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా 5 టీఎంసీల సామర్థ్యం కలిగిన గండిపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube