సనత్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి తలసాని

సనత్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి తలసాని

0
TMedia (Telugu News) :

సనత్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి తలసాని

టీ మీడియా, నవంబర్ 9, హైదరాబాద్‌ : సనత్‌నగర్ నియోజవర్గం అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సికింద్రాబాద్‌లోని నార్త్ జోన్ జీహెచ్ ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఈ రోజు నామినేషన్ వేశానని తెలిపారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కానున్నారని చెప్పారు. 24 గంటలు కరెంట్ కావచ్చు, రైతులుకు సాగు నీరు కావచ్చు అన్ని రకలుగా రైతులను ఆదుకున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నామని తెలిపారు. చరిత్రలో జరగనటువంటి అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరిగాయన్నారు.

Also Read : బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్

దశల వారీగా పనులు చేసుకుంటూ పోతున్నామని..సనత్ నగర్ నియోజవర్గం ప్రజలు ఆశీస్సులుతో మూడోసారి గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. కరోనా కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ప్రభుత్వం ఆదుకుందన్నారు. హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చేసామని..అన్ని వర్గాల పండగలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube