బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
టి మీడియా,మే16, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ పసికందు కిడ్నాప్నకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. గుర్తు తెలియని ఇద్దరు శిశువును ఎత్తుకువెళ్లగా.. ఇవాళ వరంగల్లో పసికందును గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న వారి వద్ద శిశువును గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య గత నాలుగు రోజులుగా వేములవాడ రాజన్న ఆలయం మెట్ల మీద ఇద్దరు కుమారులతో కలిసి ఒంటరిగా ఉంటుంది. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలి వెళ్లిపోయాడు.
Also Read : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
దీంతో అదే అలుసుగా భావించిన కొందరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. లావణ్యకు దుండగులు మద్యం తాగించి, వేకువ జామున 28 రోజుల వయస్సున్న శిశువును అపహరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. వరంగల్ వరంగల్ రైల్వేస్టేషన్లో ఇద్దరి నుంచి శిశువును గుర్తించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube