నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే
టీ మీడియా; జూన్28;జగిత్యాల :కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దీకొండ స్వామి కుమారుడైన దీ కొండ రాజేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు వైద్యానికి డబ్బులు లేక పోవడంతో ఎమ్మెల్యే రవి శంకర్ గారిని ఆశ్రయించారు. వారి సమస్యను విన్న వెంటనే ఎమ్మెల్యే గారు తన మానవత్వాన్ని చాటుకుని మీకు అండగా నేను మీకు ఉన్నాను అంటూ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ద్వారా 2 లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Also Read : ఎస్బీఐ బ్యాంక్లో రూ.5 కోట్లు గోల్ మాల్
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రవి శంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, మండల ఆర్ బి ఎస్ చైర్మన్ అంకం రాజేశం, మండల యూత్ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు దీకొండ చంద్రశేఖర్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube