ఎమ్మెల్యే సైదిరెడ్డి, దిష్టిబొమ్మ దాహనం
-చేసిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు
టీ మీడియా, అక్టోబర్ 28, హుజూర్ నగర్ : నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఎన్.ఉత్తమ కుమార్ రెడ్డి పై అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎమ్మెల్యే సైదిరెడ్డి దిష్టి బొమ్మను పట్టణ కాంగ్రెస్ శ్రేణులు శనివారం దహనం చేశారు.ఈ సందర్భంగా హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, బూతు కమిటీ అధ్యక్షుల సమావేశంలో హాజరైన ముఖ్య నాయకులు మాట్లాడుతూ… నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి ప్రభుత్వ పథకాలను నామినేషన్ డే కన్నా ముందుగా నవంబర్ రెండో తారీకు కల్లా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఈసీని కోరగా… దానికి రాష్ట్రంలోని బిఆర్ఎస్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎంపీ ప్రభుత్వ పథకాలను నిలిపి చేయాలని ఈసీ ని కోరినారని వక్రీకరించి అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని. 30 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాబోతుందని హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గల లో కాంగ్రెస్ అభ్యర్థులు 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలవబోతున్నారని, సైదిరెడ్డి కెనడా వెళ్లి తన వృత్తిని కొనసాగించుకోవాల్సిందేనని
Also Read : రాజస్థాన్లో రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ‘ఉచితాలు’ స్వాధీనం
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి, హుజూర్నగర్ నియోజకవర్గంలో సైదిరెడ్డికి ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పడం ఖాయమని, ఎమ్మెల్యే సైదిరెడ్డి ఒక సైకో అని,అరాచక వాదని, ప్రశాంతంగా ఉన్ననియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం తేవాలని చూస్తున్నారని, ఇవన్నీ కూడా ఓటమి భయంతో చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, బూతు కమిటీల సభ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube