మహిళపై వేధింపుల కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే
టీ మీడియా, డిసెంబర్ 2, కాన్పూర్ : భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఒక మహిళపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, అతని సోదరుడు రిజ్వాన్ సోలంకి పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం ఉదయం కాన్పూర్ కమిషనర్ క్యాంప్ ఆఫీస్కు వచ్చిన నిందితులు.. కమిషనర్ ముందే లొంగిపోయారు. ఓ భూమికి సంబంధించి ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, అతని సోదరుడు రిజ్వాన్ సోలంకిలకు ఒక మహిళతో వివాదం ఉంది.
Also Read : అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్, సొంత స్థలం వారికిఐదు లక్షలు ఇవ్వాలి
ఈ క్రమంలో వారు గత నెల మహిళపై బెదిరింపులకు పాల్పడటమేగాకుండా, ఆమె ఇంటికి నిప్పుపెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు శుక్రవారం లొంగిపోయారు.