వరద బాధితులకు నీళ్ళు అందించేందుకు ట్యాంకర్ల తరలింపు..
ప్రారంభించిన ఎంపీపీ సామినేని హరిప్రసాద్
టీ మీడియా, జులై19,ముదిగొండ :రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులు పాటు కురిసిన వర్షలతో భద్రాచలం, కొత్త గూడెంలో అధిక వరదలు ప్రభావిత ప్రాంతాల్లో ఉండే ప్రజలు నీళ్ళకు, తినటానికి ఇబ్బందులు పడటంతో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు అట్టి బాధితులకు మంచి నీటిని అందించేందుకు మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి మండలంలోని మేడేపల్లి, మాధాపురం, గంధసిరి, మల్లన్నపాలెం, పండ్రేగుపల్లి, ఖానాపురం, న్యూలక్ష్మీపురం, యడవల్లి లక్ష్మీపురం, సువర్ణాపురం, వెంకటాపురం గ్రామ పంచాయతీలకు సంబంధించిన పది నీటి ట్యాంకర్లు బయలుదేరాయి.
Also Read : కేసీఆర్ కు కృతజ్ఞతలు
వాటితో పాటు అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ముందరపు లక్ష్మి, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, ఎంపీవో సూర్యనారాయణ, వెంకటాపురం గ్రామ సర్పంచ్ కోటి అనంత రాములు, నాయకులు మందరపు ఎర్ర వెంకన్న, కార్యదర్శులు సందీప్, హరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube