ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి

ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి

0
TMedia (Telugu News) :

ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి

టీ మీడియా, అక్టోబర్ 30, మెదక్‌ : మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై సోమవారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన గట్టని రాజు అభ్యర్థిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో గాయమైంది. వెంటనే కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని కార్యకర్తలు చితకబాదారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టారు. కాగా దాడి చేసిన రాజు ప్రైవేటు టివి రిపోర్టర్ కావడం విశేషం.

Also Read : ఎంపీపై హ‌త్యాయ‌త్నానికి పాల్పడిన నిందితునిపై కేసు నమోదు

కాగా , నారాయణ్ ఖేడ్ సభకు వెళ్తున్న మంత్రి హ‌రీష్‌రావుకు విషయం తెలియగానే గజ్వేల్ ఆసుపత్రికి బ‌య‌ల్దేరారు. ఫోన్ లో పరామర్శించి అరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఫోన్‌లో ధైర్యం చెప్పి, అత్యవసరం అయితే హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube