ఉదారతన చాటుకున్న ఎంపీ మాలోతు కవిత

ఉదారతన చాటుకున్న ఎంపీ మాలోతు కవిత

0
TMedia (Telugu News) :

ఉదారతన చాటుకున్న ఎంపీ మాలోతు కవిత

టీ మీడియా, నవంబర్ 15, మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో కవిత ఎప్పుడు ముందే ఉంటారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం డోర్నకల్ నియోజకవర్గంలో ప్రచారానికి బయలుదేరారు. కాగా, మార్గ మధ్యంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతిని చూసి చూసిన ఎంపీ వెంటనే తన కాన్వాయిని ఆపారు. క్షతగాత్రురాలిని తానే స్వయంగా ఆటోలో ఎక్కించి దవాఖానకు తరలించి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. ఎంపీ కవిత చొరవకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : గన్తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube