ఎంపీ నామ రంజాన్ శుభాకాంక్షలు
టి మీడియా,మే03,ఖమ్మం:
తెలంగాణ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పర్వదినం ఓ ప్రతీక అని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం ముస్లిం సోదర, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : కలెక్టర్ అనుదీప్ రంజాన్ శుభాకాంక్షలు
ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మక ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube