నేటి నుండి జిల్లాలో ఎంపీ నామ పర్యటన
టీ మీడియా, మే04,ఖమ్మం :నేటి నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పర్యటించనున్నారు. అందులో భాగంగా నేడు బుధవారం నాడు ఖమ్మం జిల్లా పాలేరు, ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, జిల్లా తెరాస అధ్యక్షులు ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్ తో కలసి ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొంటారని ఎంపీ క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read : రైల్వే టీసీ జాబ్ పేరిట నకిలీ లెటర్లు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube