పలు కుటుంబాలకు ఎంపీ నామ పరామర్శలు
టి మీడియా, అక్టోబర్ 16,ఖమ్మం : బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం. పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి, పలు చోట్ల జరిగిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను కూడా పరామర్శించారు. ఖమ్మం వీడియోస్ కాలనీలో నల్లమల పూర్ణచందర్ రావు గారింటికి వెళ్లి, ఆయన గారి భార్య లలిత చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి, ఘటించి, సంతాపం తెలిపి, నివాలర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పూర్ణచందర్ రావు గారి కుటుంబ సభ్యులతో పాటు రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read : పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలి
ఈ సందర్భంగా వీడియోస్ కాలనీలో ఇటీవల రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ మూలగండ్ల వెంకటేశ్వరరావు గారి కుమారుడు రమేష్ నాయుడు గారు మృతి చెందగా, వారింటికెళ్ళి రమేష్ నాయుడు చిత్ర పటానికి పూల మాల వేసి, నివాలర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube