చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం మునగకాయలు కిలో ధర రూ.600 పలికింది.కిలోకి 12 నుంచి 18 మునగకాయలు తూగుతాయి. ఈ లెక్కన ఒక్కొక్కటీ రూ.30 పైనే పలికింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె పరిసరప్రాంతాల్లో మునగ చెట్లు పూర్తిగా దెబ్బతినడంతో తమిళనాడు నుంచి కాయలు దిగుమతి అవుతున్నాయి. వంగ, బీర, కాకర, బీన్స్, బెండ, ముల్లంగి తదితర కూరగాయలు మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.150 ధర పలుకుతున్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube