మద్యం మత్తులో స్నేహితుడి హత్య
టి మీడియా,మే10,హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేశారు. సయ్యద్ నగర్కు చెందిన ఓమర్ తన స్నేహితులతో సోమవారం రాత్రి మద్యం సేవించాడు.
Also Read : టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్
ఈ క్రమంలో ఓమర్కు తన స్నేహితులతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.దీంతో సహనం కోల్పోయిన స్నేహితులిద్దరూ ఓమర్పై బీర్ బాటిల్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఘటనాస్థలిలోనే ఓమర్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube