రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు
టి మీడియా,జూన్ 24,అమరావతి : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూకు ఏపీ వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు.
Also Read : శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ ఇవాళ ఢిల్లీలో నామినేషన్ వేసే ప్రక్రియకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఏపీ కేబినెట్ సమావేశం దృష్టా ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 నుంచి కేంద్రంతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తుంది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు వైసీపీ మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube