నవ వధువు అదృశ్యం
టి మీడియా,మే14,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మధురానగర్ కాలనీకి చెందిన యమున అనే నవవధువు అదృశ్యం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి యమున బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త దత్తు ఆందోళనకు గురయ్యాడు. గత మూడు నెలల క్రితం దత్తుతో యమున వివాహం జరిగింది. బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భర్త దత్తు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube