ఒమిక్రాన్ వేరియంట్లే ఎక్కువగా వ్యాపిస్తున్నాయి
టీ మీడియా ఆగస్టు 6, న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్సీవోవీ2 జీనోమిక్స్ కన్సోర్టిమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) తన వీక్లీ సమావేశానికి చెందిన డేటాను రిలీజ్ చేసింది. ఇండియాలో ప్రస్తుతం ఏ కరోనా వేరియంట్ విస్తృతంగా ఉందో ఐఎన్ఎస్ఏసీఓజీ స్టడీ చేసింది. ఒమిక్రాన్తో పాటు దానికి చెందిన వేరియంట్లే ఇండియాలో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తేల్చారు.
Also Read : మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంకు టీటీడీ ఆహ్వానం
ప్రస్తుతం ఇండియాలో మళ్లీ కోవిడ్19 కేసులు పెరుగుతున్నాయి. కానీ ఆ వైరస్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నవారి సంఖ్య తగ్గింది. మరణాలు కూడా ఎక్కువగా లేవు. ప్రతి వారం డేటాను సమీక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే కొత్త వేరియంట్లు ఏమీ లేవని ఐఎన్ఎస్ఏసీఓజీ వర్గాలు వెల్లడించాయి. BA.2.75 సబ్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube