ఒకే వ్యక్తికి 12 మంది తండ్రులు

ఒకే వ్యక్తికి 12 మంది తండ్రులు

0
TMedia (Telugu News) :

ఒకే వ్యక్తికి 12 మంది తండ్రులు.

 టీ మీడియా,మార్చి 10,తిరుపతి :ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతిలో మొన్న ఓ మహిళకు 18 మంది భర్తలను సృష్టించి దొంగ ఓట్లను నమోదు చేశారు. తాజాగా తిరుపతిలోని 221వ పోలింగ్‌ బూత్‌ పరిధిలో కెబిలేఅవుట్‌ నందు 6-19-57-354 ఇంటి నంబరులో మణి అనే వ్యక్తి పేరు మీద 11 ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల జాబితాలోని 760, 763, 765, 766, 768, 769, 770, 772, 773, 775, 778 సీరియల్‌ నంబర్లలో ఓటరుగా 11 సార్లు నమోదు కావడమే కాకుండా, ఒక్కో నంబరు దగ్గర మణి తండ్రి పేరును 11 రకాలుగా పేర్కొన్నారు. టీడీపీ నాయకుల క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి గెలుపుకోసం అప్రజాస్వామిక పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోందని వామపక్ష నాయకులు విమర్శించారు. అధికార పార్టీ నాయకులు తప్పుడు మార్గంలో గెలవాలనుకుంటున్న వైనాన్ని పట్టభద్రులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి

Also Read : కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube