చొరబాటుకు యత్నించిన పాక్‌ ఉగ్రవాది హతం

చొరబాటుకు యత్నించిన పాక్‌ ఉగ్రవాది హతం

0
TMedia (Telugu News) :

చొరబాటుకు యత్నించిన పాక్‌ ఉగ్రవాది హతం

టీ మీడియా, ఫిబ్రవరి 16, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో దేశంలోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతమొందించాయి. కుప్వారాలోని సైద్‌పొరాలో వాస్తవాదీన రేఖ వెంబడి ఉగ్రవాదులు అక్రమ చొరబాటుకు యత్నిస్తున్నారనే నిర్ధిష్టమైన సమాచారం ఆర్మీకి అందింది. దీంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. పూర్తివివరాలు వెల్లడిస్తామన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

Also Read : పండు మాత్రమే కాదు.. పచ్చి బొప్పాయితోనూ ఆరోగ్య ప్రయోజనాలు ..

ఈ ఏడాది కశ్మీర్‌ రీజియన్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించడం ఇదే మొదటిసారి. మొత్తంగా జమ్ముకశ్మీర్‌లో మూడోసారి. కాగా, పాకిస్థాన్‌తో మరోసారి కాల్పలు విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో కాల్పుల ఘటనలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తూనేఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube