కాంగ్రెస్‌ కి పాల్వాయి స్రవంతి రాజీనామా

కాంగ్రెస్‌ కి పాల్వాయి స్రవంతి రాజీనామా

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్‌ కి పాల్వాయి స్రవంతి రాజీనామా

టీ మీడియా, నవంబర్ 11, మునుగోడు : పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. త్వరలో బిఆర్‌ఎస్‌ లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు. ఇటీవల మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో కాంగ్రెస్‌ నేత, పాల్వాయి స్రవంతి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మునుగోడు నుంచి టికెట్‌ ఆశించి భంగ పడ్డ పాల్వాయి స్రవంతి.. తదుపరి కార్యాచరణపై నియోజవర్గ కాంగ్రెస్‌ నేతలు కైలాష్‌ నేత, కార్యకర్తలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ ను మోసం చేసి వెళ్లిన కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పాల్వాయి స్రవంతి, కైలాష్‌ నేత అన్నారు. భవిష్యత్‌ కార్యచరణపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

Also Read : కామారెడ్డిలో నామినేష‌న్ వేసిన‌ రేవంత్ రెడ్డి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube