పేపర్ లీకేజ్ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
టీ మీడియా, మార్చి 19, వనపర్తి బ్యూరో : ఖిల్లా ఘనపూర్ మండల్ కేంద్రంలో మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ పైన ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్,జిల్లా దివ్యాంగుల సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంజాయి రమేష్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నూరు జయాకర్,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న,మాజీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఎంపీటీసీ విజయలక్ష్మి, కృష్ణయ్య, దేవుజా నాగేశ్వర్, ప్రభాకర్ రెడ్డి, చెన్నయ్య, నరేందర్ గౌడ్, భరత్ సాగర్, బల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులుఅనిల్, నరేందర్, గౌస్, వంశీ, శేఖర్ రెడ్డి, సునీల్, రాజు, శ్యామ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube