చైతన్య పరిచేందుకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు

చైతన్య పరిచేందుకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు

0
TMedia (Telugu News) :

 

 

ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఖమ్మం కార్పోరేషన్ లోని 16 డివిజన్లతో సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా BRS జిల్లా ఇంఛార్జి శేరి సుభాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, BRS జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, ఎంపి నామ నాగేశ్వరరావు గారు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్పాల్గొనిమాట్లాడారు.అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు

 

 

also rad :రాహుల్‌ గాంధీ ఇంటికి పోలీసులు

క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహింస్తున్నమని పేర్కొన్నారు. నాకు BRS ద్వారా మీలాంటి వేల మంది కుటుంబాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఅర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని, అన్నిటి కంటే ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ఇలానే ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలిచే జ్ఞాపకశక్తిని నాకు జీవితాంతం దేవుడు ఇలాగే ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.ఖమ్మం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబ సభ్యులు అని వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమం, అభివృధ్ధిని వారికి చేరువ చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా చేర్చగలిగామని వివరించారుదళిత బందు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందిస్తామని, గడచిన రెండేళ్లలో నియోజకవర్గంలోనే 2500 ఇళ్లు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఇస్తామన్నారు.నన్ను ఖమ్మం ప్రజలు అందరి వాడుగా చూసుకుంటారని, మైనారిటీలు ప్రేమతో అజయ్ ఖాన్ గా పిలుచుకుంటారు క్రైస్తవులు ప్రభువు బిడ్డగా ఆత్మీయంగా చూసుకుంటారని గుర్తు చేశారు.

 

 also read :వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.  గత ఖమ్మంను నేటి ఖమ్మంతో పోల్చి చూడండి, ఒకప్పుడు ఖమ్మం నగరంలో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం రోడ్ల మీద త్రాగునీటి ట్యాంకర్ లతో గల గల నడిచిన నాటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. నేడు ఎక్కడైనా వాటర్ ట్యాంకర్ లు కనబడుతున్నాయా అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని నిజమా కాదా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని అన్నారు. జాతీయ పార్టీలు వాటికున్న బుజులు దులుపుకుని రోడ్లు ఎక్కుతున్నారని ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.నాకు ఇక్కడే ఓటు ఉంది, ఇక్కడే చదివినా.. ఇక్కడే ఉన్నా, ఇక్కడే తిరిగిన, నా బతుకు ఇక్కడే.. నా చావు కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు.ఇక్కడ ఓటు లేనోల్లు కూడా దాబులకు మాట్లాడుతారని, ఎం అర్హత ఉందో తెలియక కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని తాటాకు చప్పుళ్ళు చేస్తు, అవాక్కులు చవాక్కులు పెలుతున్నారని అన్నారు.నీ ఊడత ఉపుడుకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని, అక్కడ ఉన్నది కేసీఅర్ గారు అని అది గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిదని హితువు పలికారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube