సొంత డబ్బులతో పెన్షన్ ఇచ్చి
– ఆదుకుంటున్న అడ్డాకుల జడ్పీటీసీ
టీ మీడియా ఆగస్టు 20, అడ్డాకుల: అడ్డాకుల మండలం లోని కందూర్ గ్రామం లో 13 మంది నిరుపేద కుటుంబాలకు సాంకేతిక ఇతర అనివార్య కారణాల చేత ప్రభుత్వ పెన్షన్ రానందున వారి ఆర్థిక పరిస్థితిని స్థానిక నాయకుల ద్వార తెలుసుకున్న, జడ్పిటిసి గత నాలుగు నెలలు గా ఒక్కొక్కరికి రూ, వెయ్యి చొప్పున ఆసరా పెన్షన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఈ ఆగస్టు నెల పెన్షన్ స్థానిక బిఆర్ఎస్ నాయకులకు పంపడం జరిగింది. ఈరోజు కందూర్ గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ అడ్డాకుల మండల అధ్యక్షులు టి.శ్రీనివాస్ రెడ్డి, కందూర్ దేవస్థానం కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్యాదవ్,స్థానికనాయకులు,కార్యకర్తలుతిరుపతయ్యయాదవ్,భాస్కర్,మహేష్, మైబు, లక్ష్మణ్, నిరుపేద పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. సేవా భావంతో నిరుపేదలను అందుకుంటున్న జడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి గారికి స్థానిక బిఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు, కృతజ్ఞతలు తెలియజేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube