పోలవరంపై విచారణ చేస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం
పోలవరంపై విచారణ చేస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం
పోలవరంపై విచారణ చేస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం
టి మీడియా,జూలై1,అమరావతి : ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకుడు దేవినేని ఉమ అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం డ్యామ్పై విచారణ చేస్తే జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.పోలవరంపై ఎక్కడైనా సరే ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుతో చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంబటికి అవగాహన లేక పాతపాటే పాడుతున్నారని ఆరోపించారపోలవరంపై చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు్కు రమ్మంటావా , తాడేపల్లి రాజప్రసాదానికి రమ్మంటావా అని సవాలు చేశారు.
Also Read : మెట్టు మెట్టు ఎక్కి ‘పది’లో ఫస్ట్ నిలిచాం : మంత్రి హరీశ్ రావు
మూడు సంవత్సరాల్లో పోలవరం డ్యాం ఎంత పూర్తి చేశారో చెప్పే ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆధారాలతో సహా చంద్రబాబు లేఖ రాశారని వెల్లడించారు. పవర్ ప్రాజెక్టుల కక్కుర్తి కోసం, పవర్ ప్రాజెక్టులు కొట్టెయ్యడం కోసం వైఎస్ జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube