కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట మునగడం కాయం
టీ మీడియా, అక్టోబర్ 26, జన్నారం: కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయమని మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రాజారాం రెడ్డి అన్నారు. టిపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి రైతు బంధు నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం పట్ల బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు గురువారం రోజున మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారందరూ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతుబంధు పథకంపై ఎన్నికల సంఘానికి లేఖ రాసి కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ ప్రజానీకం మీద ఉన్న తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని కరోనా విపత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతుబంధు పథకాన్ని ఆగనివ్వలేదన్నారు.
Also Read : ఈడి, సిబిఐలు దేశంలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి
రైతుబంధు వద్దనే లేఖ రాయడం కాంగ్రెస్ అయినా అనైతికథకు నిదర్శనం అని, కాంగ్రెస్ ను నమ్మవద్దని తెలిపారు. కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధికారులు ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube