రైతుబంధును ఆపెలా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ని బొందపెట్టాలి
రైతుబంధును ఆపెలా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ని బొందపెట్టాలి
రైతుబంధును ఆపెలా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ని బొందపెట్టాలి
– మంత్రి సత్యవతి రాథోడ్
టీ మీడియా, అక్టోబర్ 26, మహబూబాబాద్ : సాగు, తాగు, సంక్షేమ రంగాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసిఆర్ది. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా కీలక పథకాలను కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశామని గిరజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణం, హెలిపాడ్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించి మాట్లాడారు. పదేళ్లకు ముందు మానుకోట ఇప్పటి మానుకోట వ్యత్యాసం మన అనుభవంలో ఉంది. తండాలను గ్రామపంచాయతీలుగా చేశాం. 6 శాతం ఉన్న రిజ్వేషన్లను 10 శాతానికి పెంచామన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు కావాలన్న కాంగ్రెస్ కావాలో..24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రైతుబంధును అడ్డుకునేలా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ను బొందపెట్టాలి. కర్ణాటక తరహాలో ఇక్కడ అరాచక పాలన చేసేందుకు కాంగ్రెస్ తెలంగాణలో అబద్ధాలు చెబుతుందని మండిపడ్డారు. పథకాల లబ్దిదారులంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి.
Also Read : కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట మునగడం కాయం
సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించి, మహబూబాబాద్ ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ను మూడోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలత్ కవిత, బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి బీరవెల్లి భరత్ కుమార్, మహబూబ్ పాషా, మర్రి రంగారావు, పరకాల శ్రీనివాస్ రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube