భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాతే సీఎంగా ప్రమాణ స్వీకారం
-ఖమ్మంలో కూడానిరూపిస్తాము
-బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
టీ మీడియా,ఆగస్టు3,యాదాద్రి:
నల్గొండ జిల్లాలో భాజపా ఎక్కడుందని అనేవాళ్లకు తామేంటో చూపించామని, ఖమ్మంలో కూడానిరూపిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట నుంచి మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడారు. భాజపా అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భాజపా కార్యకర్త ఉగ్రనరసింహ అవతారం ఎత్తి కేసీఆర్ సర్కారును పారద్రోలాలని పిలుపునిచ్చారు.
Also ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి ఎస్సై రాజ వర్ధన్
‘‘రజాకార్లను తరిమికొట్టిన గడ్డ నల్గొండ. నల్గొండ గడ్డకు శక్తి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం గజ గజ వణికిపోతోంది. బుక్కెడు బువ్వ కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి నిజాయితీ ఉంటే ట్రిపుల్ ఐటీ, గురుకుల పాఠశాలల్లో భోజనం చేయాలి. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్ దిల్లీ రాజకీయ సమీకరణాలు మారుస్తానంటున్నారు. రైతుల రుణమాఫీ చేయకుండా నట్టేట ముంచారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు ఎంతమందికి వచ్చింది. ఉచితంగా యూరియా ఇస్తానని కేసీఆర్ చెప్పారు. ఒక్కరికైనా.. ఉచితంగా యూరియా ఇచ్చారా.
వాసాలమర్రికి వంద హామీలు ఇచ్చారు.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. చేనేత బీమా ఇస్తామని ఏడాది క్రితం ప్రకటించారు. ఎంతమందికి చేనేత బీమా ఇచ్చారో కేసీఆర్ స్పష్టం చేయాలి. చేనేత బీమా ఇచ్చే వరకు భాజపా ఊరుకోదు. క్యాసినో వ్యవహారం వెనుక తెరాస నాయకుల హస్తం ఉంది. నయీమ్ డైరీ, స్వాధీనం చేసుకున్న రూ.వేల కోట్లు ఎక్కడికి పోయాయో సీఎం కేసీఆర్ చెప్పాలి. తప్పకుండా కేసీఆర్ దోచుకున్న సొమ్మును రికవరీ చేస్తాం. తెలంగాణ కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన యువత భాజపా కోసం పని చేయాలి. అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని బండి సంజయ్ అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube