రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం

రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం

0
TMedia (Telugu News) :

రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం

 – ఇన్చార్జి కుక్కల వెంకన్న

టి మీడియా, అక్టోబర్ 30, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ పట్టణంలో పిల్లుట్ల రఘు పార్టీ ఆఫీసు నందు రఘున్న ఆదేశాల మేరకు మహిళా మణులతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పిల్లుట్ల రఘు చేసిన ప్రజా సేవ కార్యక్రమాలకు ముగ్దులై స్వచ్ఛందంగా రఘు అన్న మీద అభిమానంతో గడపగడపకు సింహం గుర్తుకు ఓటేయమని  ప్రచారం నిర్వహించారు. పిల్లుట్ల రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మహిళలు అన్నారు.. ఈ సందర్భంగా కుక్కలు వెంకన్న మాట్లాడుతూ.. సింహం సింగిల్ గా వచ్చి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానులతో జెండా ఎగరవేయడం ఖాయమని, స్వతంత్ర అభ్యర్థిగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించేది తమ అభిమాన నాయకుడు పిల్లుట్ల రఘున్న అని అన్నారు.. గత మూడు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేశామని,  ఎందరినో విద్యా, వైద్య, ఆర్థికంగా ఆదుకున్నామని,  ఎన్నో ఊర్లలో తాగునీటి కోసం బోర్లు వేయించిన ఘనత పిల్లుట్ల రఘున్నది అన్నారు.. అధికారం లేకపోయినారఘున్న గొప్ప పనులు చేశాడు.

Also Read : ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా

ప్రజలందరూ ఒకసారి ఆలోచించి  సింహం గుర్తుకు ఓటేసి పిల్లుట్ల రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. మంచి పనులు చేయడానికి పార్టీలు అవసరం లేదని, మోసం చేసే నాయకుల అవసరం లేదని, అవినీతి నాయకులు దుర్మార్గులు అవసరం లేదని నిజమైన ప్రజాసేవ చేసే నాయకుడిగా, అభివృద్ధి కోసం,మన భవిష్యత్తు కోసం సింహం గుర్తుకు ఓటేసి పిల్లుట్ల రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించి, ప్రజా తీర్పు కూడా మంచి వైపే అని నిరూపిద్దాం. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల సింహం గుర్తు ఇన్చార్జులు, పిఆర్ఓ శివారెడ్డి, బొమ్మ కంటి సైదులు, శివశంకర్ యాదవ్, పిల్లుట్ల సునీల్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube