సండ్ర వెంకట వీరయ్య గెలిస్తెనే నియోజకవర్గం అభివృద్ధి
– ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి
టీ మీడియా ,నవంబర్ 11, సత్తుపల్లి : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గెలిస్తేనే నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాధిస్తుంది అని సండ్ర సతీమణి మహాలక్ష్మి అన్నారు. శనివారం సత్తుపల్లి లోని ఎన్టిఆర్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ మాట్లాడారు. సత్తుపల్లి పట్టణం గ్రామాలు ఇంతలా అభివృద్ధి చెందాయంటే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితోనే అని పేర్కొన్నా రు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యే నిరంతరం పోరాటం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మహిళలు సండ్ర సతీమణి కి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ 55ఏండ్ల కాలంలో చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9ఏండ్లల్లో సాధ్యమైందని తెలిపారు.
Also Read ; హర్యానాలో కల్తీ మద్యంతో 19 మంది మృతి
ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ కోత్తూరు ఉమా మహేశ్వర రావు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ లు పట్టణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube