రాజస్థాన్లో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకివ్వడం లేదు
రాజస్థాన్లో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకివ్వడం లేదు
రాజస్థాన్లో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకివ్వడం లేదు
– అసదుద్దీన్ ఓవైసీ
టీ మీడియా, నవంబర్ 18, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ డిక్లరేషన్ గురించి ప్రస్తావిస్తూ.. రాజస్థాన్లో ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఎందుకు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్లో కూడా ఆ డిక్లరేషన్ లేదన్నారు. శనివారం నాంపల్లిలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో అసదుద్దీన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తన కుటంబానికి చెందిన సీటునే ఓడిపోయారని విమర్శించారు. తెలంగాణలో మంచి స్కీమ్లు ఉన్నాయని, అవన్నీ తమ ప్రజలకు అందుతున్నట్లు ఓవైసీ అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటి స్కీమ్లు, ఆసర పింఛన్లు అందుతున్నట్లు ఓవైసీ వెల్లడించారు.
Also Read : బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube