చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోంది

చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోంది

0
TMedia (Telugu News) :

చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోంది

– నారా లోకేశ్‌

టీ మీడియా, అక్టోబర్ 14, అమరావతి : అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. శనివారం గన్నవరం నుండి నేరుగా రాజమండ్రికి లోకేశ్‌ బయలుదేరారు. చంద్రబాబును ములాఖత్‌ ద్వారా కలిసేందుకు ఆయన కుటుంబీకులు జైలు అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ మాట్లాడుతూ … టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందని అన్నారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు.

Also Read : అరటిపండ్లు ఎక్కువగా తింటే.

వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ రిమాండ్‌లోనే ఆయనను ఉంచాలనే కుట్ర చేస్తున్నారని, భద్రత లేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ తప్పూ చేయని ఆయన పట్ల ఈ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube