మంత్రి గెలుపు నల్లేరు మీద నడక
– మంత్రి చేసిన అభివృద్ధియే గెలిపిస్తుంది
టీ మీడియా, ఫిబ్రవరి 25, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా రాజకీయాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి చిరస్థాయిలో నిలిచిపోతుంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక అనే చెప్పవచ్చు. వనపర్తి నియోజకవర్గంలో ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టిడిపి నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒకరి తర్వాత ఒకరు గెలుస్తూ ఉండేవారు. కానీ వారి హయాంలో రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వారిద్దరు కాకుండా మూడో వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు 51 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించడంతో వనపర్తిలో రోడ్డు విస్తరణ ప్రారంభమైంది. వచ్చే ఎలక్షన్లో సిట్టింగ్లకే టికెట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరంజన్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉంది.కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు.కానీ చిన్నారెడ్డి మాత్రం నాకే టికెట్ వస్తుందని ధీమాతో నియోజకవర్గంలో ఉంటూ పర్యటిస్తున్నారు.
Also Read : బెల్లంపల్లి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి
కానీ గత కొద్దిరోజులుగా వనపర్తి జిల్లాలో చిన్నారెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు కొందరు చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే మేము పనిచేయమని వ్యతిరేకిస్తున్నారు. కొత్తవారికి అవకాశం ఇస్తే పనిచేస్తామని రాజ్ భవన్ దాక వెళ్లి వచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నారెడ్డి ముందుకు వెళ్లిన ఈసారి గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. బిఎస్పి పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాగనమోని చెన్నారాములు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అధికార పార్టీ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో అంత చురుగ్గా పనిచేయడం లేదని పార్టీలో కొందరు తన వ్యవహార శైలిపై చర్చించుకుంటున్నారు.ఒకవేళ బిఎస్పి పార్టీ అతనికి టికెట్ ఇచ్చినా గెలుపు కష్టమే ప్రతిపక్షాలలో వనపర్తి నియోజకవర్గంలో బలమైన నాయకులు లేరు కాబట్టి ఎటు చూసినా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : ఇ డబ్ల్యు ఎస్అ భ్యర్థులకు గుడ్ న్యూస్
మంత్రి అయిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధిని సాధించారు. నియోజకవర్గంలో టౌన్ రోడ్ల విస్తరణ, జేఎన్జీయూ ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజ్, అగ్రికల్చరల్, గురుకుల డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, 70కి పైగా మీని ఎత్తుపొద్దుల పథకం ఏర్పాటుతో సాగునీరు అందించడం, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ మార్కెట్ నిర్మాణం మొదలైన ఎన్నో అభివృద్ధి పనులు జిల్లాకు సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సానిహిత్యంతో కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి, దళిత బంధు వంటి పథకాల కింద అధిక నిధులు జిల్లాకు తీసుకువచ్చి ప్రజలకు అందించడంలో గణనీయంగా కృషి చేశారు. కాబట్టి మంత్రికి మరొకసారి అవకాశం ఇస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలు కోరుతున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube