ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా సుప్రీంక్టోర్టులో పిటిషన్‌

ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా సుప్రీంక్టోర్టులో పిటిషన్‌

0
TMedia (Telugu News) :

ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా సుప్రీంక్టోర్టులో పిటిషన్‌

టీ మీడియా, ఫిబ్రవరి 2, న్యూఢిల్లీ : రాజకీయ నేతలు ఏదైనా పదవి కోసం ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే, పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ అంశం లెజిస్లేటివ్‌కు సంబంధించిన అంశం అంటూ విచారించేందుకు నిరాకరించింది. దీనిపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్టు పేర్కొంది. ఓ అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి అనుమతించడం లెజిస్లేటివ్‌ పాలసీకి సంబంధించిన సమస్య అని కోర్టు సర్వోన్నత న్యాయస్థానం.. ప్రజాస్వామ్యంలో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలా? వద్దా? అనేది పార్లమెంట్‌ నిర్ణయమని స్పష్టం చేసింది.

Also Read : కారులో చెలరేగిన మంటలు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube