తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్..
-డిసెంబర్ 3న కౌంటింగ్
టీ మీడియా, అక్టోబర్ 9, న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 10వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న స్క్రూట్నీ నిర్వహించనున్నారు.
Also Read : నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ ప్రోగ్రాం
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube