మంత్రి పువ్వాడ అజయ్ రంజాన్ శుభాకాంక్షలు
టి మీడియా,మే03,ఖమ్మం సిటీ:
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో గంగా జమునా తహజీబ్కు రంజాన్ పర్వదినం ఓ ప్రతీక అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మక ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి తెలిపారు.
Also Read : ఎంపీ నామ రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మంత్రి అజయ్ అభిలషించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ విశిష్టత అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube