ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్ ప్రమాణస్వీకారం

ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్ ప్రమాణస్వీకారం

0
TMedia (Telugu News) :

ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్ ప్రమాణస్వీకారం

టీ మీడియా, అక్టోబర్ 31, భువనేశ్వర్‌ : ఒడిశా రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఇటీవలే నియమితులైన రఘుబర్‌ దాస్ మంగళవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విద్యుత్‌ రంజన్‌ సారంగి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని గవర్నర్‌ హౌజ్‌లోగల న్యూ అభిషేక్‌ హాల్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు హాజరయ్యారు. ఒడిశా రాష్ట్రానికి 26వ గవర్నర్‌గా రఘుబర్‌దాస్ బాధ్యతలు నిర్వహించనున్నారు. బీజేపీ నాయకుడు అయిన రఘుబర్‌ దాస్‌ 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

Also Read : అదానీని కాపాడేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌..

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube