యువతి పై అత్యాచారయత్నం
టీ మీడియా, అక్టోబర్ 13, వనపర్తి బ్యూరో : విద్యుత్ శాఖలో పనిచేసే అసిస్టెంట్ లైన్మెన్ ఓ ఇంటికి విద్యుత్ బిల్లు ఇవ్వడానికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న యువతి పై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న యువతిని ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. యువతి గట్టిగ ఆరవడంతో స్థానికంగా ఉన్న మహిళలు అక్కడికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే తేరుకొని లైన్ మెన్ ను పట్టుకొని దేహశుద్ది చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో ఈ నెల 10న మంగళవారం చోటు చేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే బొందలపల్లి గ్రామ అసిస్టెంట్ లైన్ మెన్ ఆదే గ్రామంలోని ఓ ఇంటి వద్ద విద్యుత్ మీటర్ బిల్లు ఇచ్చిన అనంతరం ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి(19)పై బలవంతం చేశాడు.
Also Read : కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
ఆమె ను ఇంట్లోకి బలవంతంగా లాక్కొని వెళ్తున్న క్రమంలో సదరు యువతి అరవడంతో సమీప ఇళ్ల మహిళలంతా అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు సైతం చెప్పులతో దేహశుద్ది చేశారు. విషయం 100 ద్వారా పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube