మృతుల కుటుంబాలకు భరోసా
– నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి
టీ మీడియా, అక్టోబర్ 5, వనపర్తి బ్యూరో : మృతుల కుటుంబాలకు ఎల్లపుడు అండగా ఉంటామని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి భరోసాను ఇచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని 6 వ వార్డ్ మెట్టుపల్లి లో రంగం రాములు గుండెపోటు, 10 వ వార్డులో రేగు భగవంతు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి వేరువేరుగా మృతుల కుటుంబాలను పరామర్శించారు. పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి మృతి వారి కుటుంబాలకు తీరని లోటని వారి కుటుంబానికి మనోదైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read : వైద్యవ్యవస్థలో విప్లవం సృష్టించిన తెలంగాణ
అనంతరం రేగు భగవంతు కుటుంబానికి ఆర్ధిక సహాయం ను చేశారు. ఆయన వెంట 6వ వార్డు కౌన్సిలర్ కంచె రాఘవేంద్ర, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube