బీఎల్ సంతోష్కు ఊరట.. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే
బీఎల్ సంతోష్కు ఊరట.. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే
బీఎల్ సంతోష్కు ఊరట.. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే
టీ మీడియా, నవంబర్ 25, హైదరాబాద్ : బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోష్కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన నోటీసులపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో వాదనలు సాగాయి. ఈ కేసులో విచారణకు ఈనెల 26న లేదా 28న హాజరు కావాలని బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సిట్ జారీ చేసిన నోటీసులపై డిసెంబరు 5వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పైలెట్ రోహిత్రెడ్డి ఫిర్యాదులో సంతోష్ పేరు లేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది. ఫిర్యాదులో లేనప్పుడు FIRలో ఎలా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read : ఏల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులుగా రమేష్ నాయక్
దీంతో బీఎల్ సంతోష్ పాత్రపై ఆధారాలు ఉన్నాయన్నారు ప్రభుత్వ న్యాయవాది. సంతోష్ విచారణకు వస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని వాదనలు వినిపించారు.ఢిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube