కామారెడ్డిలో నామినేష‌న్ వేసిన‌ రేవంత్ రెడ్డి

కామారెడ్డిలో నామినేష‌న్ వేసిన‌ రేవంత్ రెడ్డి

0
TMedia (Telugu News) :

కామారెడ్డిలో నామినేష‌న్ వేసిన‌ రేవంత్ రెడ్డి

టీ మీడియా, నవంబర్ 10, కామారెడ్డి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్‌కు చెందిన ప్రజలు కొంత డబ్బులను విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు. ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు. కాగా, ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి హైద‌రాబాద్ నుంచి రేవంత్ కామారెడ్డికి చేరుకున్నారు. ఆ తర్వాత భారీర్యాలీతో వెళ్లిన రేవంత్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిద్ధరామయ్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కర్ణాటక మంత్రి బోస్ రాజు తదితరులు ఉన్నారు.

Also Read ; కాంగ్రెస్ వి కోతలు.. బీఆర్ఎస్ వి చేతలు

ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి ఈ నెల 6న తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కాగా, గతంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి షబ్బీర్ అలీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు కామారెడ్డి నుంచి పోటీచేసిన షబ్బీర్ అలీ ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగుతున్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube