బూత్ లెవెల్ అధికారుల సమీక్ష సమావేశం

బూత్ లెవెల్ అధికారుల సమీక్ష సమావేశం

0
TMedia (Telugu News) :

బూత్ లెవెల్ అధికారుల సమీక్ష సమావేశం

టీ మీడియా జూన్ 1 వెంకటాపురం:

ములుగు వెంకటాపురం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యలయం గురువారం బూత్ లెవెల్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో తహసిల్దార్ అంటి నాగరాజు మాట్లాడుతూ ఈ క్రింది అంశములు పై తగు సూచనలు ఇవ్వడం జరిగినది మే నెల 25 నుండి ప్రారంభమైన జాతీయ ఓటరు నమోదు కార్యక్రమం జూన్ 23 వరకు కొనసాగుతుందని, ఆ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటి, ఇంటికి సర్వే చేయడం జరుగుతుందని, 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేయుట, ఆదే విధంగా చనిపోయిన వారిని, గ్రామాల నుండి శాశ్వతంగా వెళ్లి పోయిన వారిని గుర్తించి ఓటరు జాబితా నుండి తొలగించుట. అలాగే ఓటరు అడ్రస్ సవరించుట, వికలాంగులను మార్కింగ్ చేయడం గురించి సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోతహసీల్దార్ అంటి నాగరాజు డిటీ రాజేశ్వర రావు అర్ఐ, మల్లయ్య బూత్ లెవెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube