ఘనంగా ఆర్జేసి జూనియర్ కళాశాల ఫెయిర్ వెల్ పార్టీ
టీ మీడియా, ఫిబ్రవరి 20,ఖమ్మం : ఆర్జేసి జూనియర్ కళాశాల ఫెయిర్ వెల్ పార్టీ వేడుకలు సోమవారం నగరం లోని ఎం.బి. గార్డెన్స్ లో ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ ముఖ్య అతిది గా హాజరై మాట్లాడారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అదేవిదంగా ఈ విద్యా సంవత్సరం లో పలు విభాగాలలో తమ ప్రతిభ కనబరిచి న విద్యార్ధులకు కృష్ణ బహుమతి ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు.క్రమశిక్షణ, పట్టుదల తో శ్రమిస్తే దేనినైనా సాధించ వచ్చు నని అన్నారు.తమ కళాశాల లో విద్య నభ్య సించి ఎంతోమంది సైంటిస్టులు గా,ప్రభుత్వ అధికారులు గా ఎదిగారని తెలిపారు.అంతేకాకుండా పలువురు విద్యార్థులు కళాకారులు గా స్థిర పడినట్లు తెలిపారు.అదేవిదంగా కళాశాల నుండి 20వేల మంది కి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
Also Read : సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు
ఆ ఒరవడి ని కొనసాగిస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీజీ,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యం.శివ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. లక్ష్మీ పతి,వైస్ ప్రిన్సిపాల్ ఎ. లింగయ్య,జూనియర్ కళాశాల ఇంచార్జ్ లుఉపేందర్ రాంబాబు,ఎస్.బి. ఐ.టి. కళాశాల ఎకడమిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube