రోడ్డు పమ్రాదం.. ఒకరు మృతి, 20 మందికి తీవ్రగాయాలు
రోడ్డు పమ్రాదం.. ఒకరు మృతి, 20 మందికి తీవ్రగాయాలు
రోడ్డు పమ్రాదం.. ఒకరు మృతి, 20 మందికి తీవ్రగాయాలు
టీ మీడియా, ఫిబ్రవరి 24, అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి ముందు ఉన్న మరో ఆటోను ఢీకొట్టి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిలో 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ తరుణంలో విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య (55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు.