ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు
టీ మీడియా,ఏప్రిల్ 13, అమరావతి: ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్లెవెలుగు బస్సు కనీస ఛార్జీ రూ. 10 పెంచినట్లు తెలిపారు. ఆర్టీసీ చార్జీలపై డీజిల్ సెస్ విధించారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2 ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5 పెంచినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని ఆర్టీఎసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. రేపట్నుంచి పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.10 ఉంటుందని ఆయన వెల్లడించారు. సెస్ పెంపు వల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.
Also Read : అన్నదాతలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube