బీఆర్‌ఎస్‌లోకి చేరికల జోరు..

-రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ప్రతిపక్షాలు

0
TMedia (Telugu News) :

బీఆర్‌ఎస్‌లోకి చేరికల జోరు..

-రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ప్రతిపక్షాలు

– మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

టీ మీడియా, నవంబర్ 2, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్, బిజెపి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ టౌన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ్ ప్రసాద్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉన్నత 70 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బిజెపి వల్ల ప్రజలు కనీస వసతులకు కూడా నోచుకోలేదని అన్నారు. రెండు ప్రధాన పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా చేస్తున్నట్లు విమర్శించారు.

Also Read : ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ తన కేడర్ కు అన్యాయం చేయడం వల్లే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అందుకే ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube