కుట్రలతో అధికారంలోకి రావడమే టీడీపీ పాలసీ : సజ్జల
టీ మీడియా ,మార్చి 29,అమరావతి : చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కుట్రలతో అధికారంలోకి రావడమే పాలసీగా పెట్టుకుందని ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ 40 ఏళ్ల సంబరాలపై చంద్రబాబుపై విమర్షలు చేశారు. ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ వేరని, ఇప్పుడున్న టీడీపీ వేరని అన్నారు. పాదయాత్రలో జగన్ మోహన్రెడ్డి తెలుసుకున్న ప్రజా సమ స్యల పరిష్కారానికి మెనీఫెస్టోలో పెట్టిన హామీలు 96 శాతం వరకు పరిష్కరించారని తెలిపారు. 13 రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీలో కల్తీ సారా మరణాలపై ఆందోళన నిర్వహించి అడ్డుకుని అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. అత్యధిక మెజార్టీ సభ్యులు గల వైసీపీ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో పోస్టులన్నీ ఖాళీగా పెట్టి నేడు మాపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం వల్ల 30 వేల మందికి ప్రమోషన్లు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
Also Read : టీడీపీతో ప్రజల జీవితాల్లో మార్పు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube