కార్మికులకు అండగా  సాముల జైపాల్ రెడ్డి

 కార్మికులకు అండగా  సాముల జైపాల్ రెడ్డి

0
TMedia (Telugu News) :

 కార్మికులకు అండగా  సాముల జైపాల్ రెడ్డి

టి మీడియా, ఆగష్టు , మేళ్ళ చెరువు:
 ఆదివారం మేళ్లచెరువు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సిబ్బంది కార్మికులకు స్వాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సాముల జైపాల్ రెడ్డి  అండగా నిలిచారు.ఈసందర్భంగా జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ .. పరిసరాలన్నీ తమ ఇంటి కంటే, తమ దేహం కంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచే గ్రామ సిబ్బంది కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.కరోనా సమయంలో ప్రపంచమంతా గజగజలాడుతూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లోంచి బయటికి రాకుండా భయపడి దాక్కున్న సరే గ్రామ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పరిసరాలని శుభ్రంగా ఉంచారు. అలాంటి వాళ్లకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని గుర్తించక పోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

also read :పాలేరు గడ్డ పై బహుజన రాజ్యం స్థాపిస్తాం.

అదేవిధంగా కార్మికుడి వేతనం గ్రామ పంచాయతీల నుంచి వస్తున్నాయని ,అసలు గ్రామపంచాయతీకి నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సర్పంచుల విషయం తెలిసిందే ఆ నిధులలో గ్రామ సిబ్బందికి వేతనం ఇవ్వడం అనేది చాలా మూర్ఖత్వం  నెలకు రూ 8000 అదికూడా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వస్తే వాళ్ల జీవనం ఎలా గడుపుతారు అని మండిపడ్డారు.అదేవిధంగా ఒక్కొక్క కార్మికుడికి నెలకు రూ 19000 చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వారి వేతనం కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నుంచి ప్రతి కార్మికుడి ఖాతాలో పడేటట్టు జీవో తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క కార్మికుడికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని ఈ సమయంలోనైనా మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు .ఈ కార్మికుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు రెండు రోజులపాటు ఆహారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు .రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మీకు అండగా, అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube