డ్రీమ్‌11లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్‌ఐ

డ్రీమ్‌11లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్‌ఐ

0
TMedia (Telugu News) :

డ్రీమ్‌11లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్‌ఐ

– సస్పెన్షన్‌

టీ మీడియా, అక్టోబర్ 19, మహారాష్ట్ర : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచిన ఎస్‌ఐ సోమనాథ్‌ను సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్‌ మానే ధ్రువీకరించారు. నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఏసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని పింప్రీ – ఛించ్వాడ్‌ పోలీస్‌ కమిషనరేటులో పనిచేసే సోమనాథ్‌ అక్టోబరు 10న విధుల్లో ఉండి.. ఇంగ్లాండ్‌ – బంగ్లాదేశ్‌ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నారని తెలిపారు. ఆయనపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు. మూడు నెలలుగా సోమనాథ్‌ డ్రీమ్‌ 11లో తన అదష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఇంగ్లాండ్‌ – బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు.

Also Read : మోసం కాంగ్రెస్‌ నైజం.. హస్తం వస్తే మనకూ కరెంటు కష్టాలే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube