సింగరేణి లో రెండు రోజుల సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి
టీ మీడియా,మార్చి 7, గోదావరిఖని :
సింగరేణి లో రెండు రోజుల సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి
టీ మీడియా,మార్చి 7, గోదావరిఖని :
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీలలో సింగరేణి లో రెండు రోజుల సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్లను ఏఐటీయూసీ శ్రేణులు విడుదల చేయడం జరిగింది.
also read:సందర్శకులతో కళకళలాడుతున్న నుమాయిష్
సోమవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికే.11.ఇంక్లయిన్ లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి మేరుగు రాజయ్య,కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ లు పాల్గొని మాట్లాడుతూ…కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం 2014 లో దేశంలోని పెట్టుబడి దారులు,బహుళ జాతి కంపెనీల,కార్పోరేట్ సంస్థల సహకారంతో అధికారం లోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల విలువచేసే ప్రభుత్వ రంగ పరిశ్రమలను,సంస్థలను, బ్యాంకులను,బొగ్గు గనులను,ఇన్సూరెన్స్ సంస్థలను,మైనింగ్,స్టీల్ తదితర సంస్థలను ప్రైవేటు వారికి అమ్మి వేస్తుందని వారు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి నాయకులు ఎస్.వెంకటరెడ్డి, ఎం.సంపత్,డి.సాయన్న, ఇనుముల రాజమొగిలి, గడ్డం నర్సయ్య,రొంటాల లింగయ్య, దొంత కుమార్, చెప్యాల భాస్కర్,గొడిశల నరేశ్,కత్తుల మల్లేశ్, కుక్కల శ్రీనివాస్,ఆరెల్లి రాజేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube