కేదార్నాథ్ ఆలయంపై మంచు దుప్పటి
లహరి, జనవరి 20, హిమాచల్ ప్రదేశ్ : ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, గంగోత్రి ఆలయాలను మంచుదుప్పటి కప్పేసింది. ఆలయ పరిసరాల్లో కనుచూపుమేర హిమపాతం పరుచుకుంది. చమోలీ జిల్లాలోని పలు ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. జోషీమఠ్ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది.
Also Read : వెలసిన ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు
హిమాచల్ ప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఇండ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. సిమ్లా, మనాలీలోని పలు ప్రాంతాల్లో శ్వేత వర్షం అలుముకొంది. రహదారులపై ఎక్కడ చూసినా హిమపాతం పేరుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube